సాయితేజ్‌కు వీనింగ్ పద్దతిలో శ్వాస ఇస్తున్న డాక్ట‌ర్లు

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:10 IST)
Sai tej
సినిమా క‌థానాయ‌కుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి అపోలో సిబ్బంది ఈరోజు మ‌ధ్యాహ్నం బులిటెన్ విడుద‌ల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అలాగే వీనింగ్ పద్దతిలో శ్వాస అందిస్తున్నామని తెలిపారు. బయోమెడికల్ టెస్టులు, అంతే కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం అంతా కూడా సాయి తేజ్ ఆరోగ్యాన్ని ఎప్పుడుకప్పుడు దగ్గర ఉండి పరిశీలిస్తూనే ఉన్నారని లేటెస్ట్ బులెటిన్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
 
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై సాయితేజ్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి తన ఆరోగ్యం పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఆసుప‌త్రిలో సాయితేజ కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు అభిమానులు కూడా ఆసుప్ర‌తి బ‌య‌ట వేచివున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన మేనేజ్‌మెంట్ టీమ్‌కూడా అక్క‌డే వుండి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు