అందాలు ఆరబోసినా అచ్చిరాలేదు... హారర్ చిత్రాలపై దృష్టి పెట్టిన హీరోయిన్

గురువారం, 28 మార్చి 2019 (14:00 IST)
కుర్రకారును రెచ్చగొట్టేలా వెండితెరపై అందాలు ఆరబోసినా ఏమాత్రం అచ్చిరాలేదు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితిని అధికమించేందుకు ఆ హీరోయిన్ సరికొత్త పంథాను ఎంచుకుంది. ఆ హీరోయిన్ పేరు ఈషా రెబ్బా. 
 
వాస్తవంగా చెప్పాలంటే తెలుగు తెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో ఈషా ఒకరు. తన అందాలతో ప్రతి ఒక్కరి దృష్టిలో పడింది. సౌందర్య .. స్నేహ తర్వాత చక్కని నవ్వుతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రేమకథా చిత్రాలను చేస్తూ వస్తున్నప్పటికీ, ఈషా రెబ్బాకి అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదనే చెప్పాలి. ఆ క్రేజ్‌ను అందుకునే పాత్రలు కూడా ఆమెకి పడలేదు.
 
అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బా, తాజాగా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాస రెడ్డి హారర్ థ్రిల్లర్‌గా సాగే ఒక కథను సిద్ధం చేసుకుని ఇటీవల ఈషా రెబ్బాకి వినిపించాడట. 
 
ఆ కథ ఆమెకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా కావడం కూడా ఆమె అంగీకరించడానికి మరో కారణమని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు