ఒక క్షణంలో తీసుకున్న నిర్ణయంలో, ఆమె తీవ్రంగా దిగి అనేక గాయాల పాలైంది. దీనిపై అభిమానులు, సహచరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె పోస్ట్లలో త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపారు. కరిష్మా శర్మ ఈ ఘటన గురించి తన ఇన్స్టాలో ఇలా రాసుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్కి చీర కట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కాను. తన స్నేహితులు రైలును మిస్ అయ్యారు.
వాళ్లు ఎక్కలేకపోయారన్న భయంతోనే కదులుతున్న రైలు నుంచి దూకేశాను. అయితే తాను వెనక్కి పడిపోవడంతో తన తలకు, వీపుకు గాయాలయ్యాయి. నేను బాగానే ఉన్నాను. త్వరగా కోలుకుంటాను. మీ అందరి ప్రేమ, అభిమానం తనకు చాలా బలాన్నిస్తుంది అని పేర్కొన్నారు.