దివ్యాంగులకోసం డ్యాన్స్ షో ప్రారంభిస్తున్న హీరో రామ్ చరణ్, ఉపాసన

బుధవారం, 7 అక్టోబరు 2020 (21:52 IST)
దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్ లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కోవిడ్ 19 నేపధ్యంలో తలెత్తిన పరిస్థితులు ప్రభావంగా నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపాలని వారు భావిస్తున్నారు.
 
దివ్యాంగులు తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఎలా అధిగమించారు? వారు తమ ఆశయాలను ఎలా సాధించారు? అన్న స్పూర్తిదాయక విషయాలను చెర్రీ ఉపాసన చూపించనున్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని అందరూ ముందడుగు వేయాలని ఉపాసన చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కొందరు దివ్యాంగుల కష్టాలు, వారు దానిని ఎలా అధిగమించారన్న విషయాలను వివరించారు. తన హృదయానికి ఎంతో చేరువైన విషయం డ్యాన్స్ అని రామ్ చరణ్ అన్నాడు.
 
సంగీతం, డ్యాన్స్ తనకు చిన్నప్పటి నుంచే చాలామందికి చేరువ చేశాయని చెప్పాడు. ఈ డ్యాన్స్ షోలో పాల్గొనే దివ్యాంగులు ur life.co.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరి నుంచి మద్దతు కోరారు. నృత్య దర్శకుడు ప్రభుదేవా కూడా వీరికి మద్దతు ఇస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు