చిరంజీవి అంటే ఇష్టమే కానీ... పవన్‌కు వంద ముద్దులు పెడతా : సురేఖావాణి

గురువారం, 13 మే 2021 (16:34 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు సురేఖావాణి. ఈమెకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవలి కాలంలో ఆమె కొంత నెమ్మదించినా... ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఆమె భర్త చనిపోవడంతో  అత్తింటి వేధింపులు భరించలేక తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. 
 
అదేసమయంలో బిడ్డకు తల్లి అయినప్పటికీ... గ్లామర్‌గా కనిపించడంలో కుర్రకారు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అపుడపుడూ షేర్ చేస్తోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. 
 
సినిమాలు కొంత తగ్గినా... సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటూ, అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సురేఖ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
 
మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానినని... ఆయనను చూసిన ప్రతిసారి తన కళ్లలో నీళ్లొస్తాయని సురేఖ చెప్పింది. 'స్టాలిన్' షూటింగ్ సమయంలో ఆయనను చూసి ఏడుస్తుంటే ఓదార్చారని... అంతేకాదు, ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని తెలిపింది.
 
ఇక మన హీరోల్లో ముద్దు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారనే ప్రశ్నకు సమాధానంగా... పవన్ కల్యాణ్‌కు అయితే వంద ముద్దులైనా పెడతానని చెప్పింది. తన కూతురు సుప్రియకు నటన పట్ల ఆసక్తి ఉందని... ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటోందని తెలిపింది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు