నేను ఇంకా దానికి బానిసను కాలేదు : నటి విద్యాబాలన్

బుధవారం, 4 జనవరి 2017 (06:07 IST)
సినీ సెలెబ్రిటీలు అభిమానులకు దగ్గరగా ఉండేందుకు, తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఇపుడు సోషల్‌ మీడియా ఓ చక్కటి వేదికగా మారింది. ముఖ్యంగా హీరోహీరోయిన్లు తాము చేసే సినిమాల వివరాలు, వ్యక్తిగత విషయాలను బహిరంగ పరిచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 
 
నటీనటులంతా సోషల్ మీడియా ఖాతాను కలిగివున్నప్పటికీ కొందరైతే ఏ అమావాస్యకో, పౌర్ణమికో మాత్రమే ఆప్‌డేట్స్‌ ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన బాలీవుడ్ సుందరాంగి విద్యాబాలన్. దీనిపై ఆమె స్పందిస్తూ 'ట్విట్టర్‌ అకౌంట్‌ చాలా కాలంగా ఉంది. కానీ రెగ్యులర్‌గా ఫాలోకాను. ఏదొక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు సరదాగా ఓపెన్ చేస్తానని చెప్పుకొచ్చింది. 
 
ఒకవేళ ఓపెన్ చేసినా 5 నిమిషాలు మించి ఉండను. ఏదైనా ట్వీట్‌ చేశాక.. 'నేనేనా ట్వీట్‌ చేసింది' అని ఆశ్చర్యపోతా. సోషల్‌ మీడియాతో మంచిచెడూ రెండూ ఉన్నాయి. శిరీశ కుందర్‌ ట్వీట్లను ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తా. ఈ ఫేస్‌బుక్‌ కూడా ఓపెన్ చేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఎక్కువగా ఫొటోలు పెడుతుంటా. అలాగని సోషల్‌మీడియాకు నేను అడిక్ట్‌ కాలేదు. త్వరలో యాక్టివ్‌ అవుతా' అని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి