గత యేడాది ఏప్రిల్లో ప్రవేశపెట్టిన పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్పీ) వర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్ పోర్టుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ-పాస్ పోర్టుల జారీని ప్రస్తుతం నాగ్పూర్, రాయపూర్, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో పైలట్ విధానంలో చేస్తున్నారు.