అగ్రహీరోయిన్ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. కానీ తాను విశ్రాంతి తీసుకుంటే.. సినిమా షూటింగ్ ఆగిపోతుందని భావించిన నయనతార.. పెయిన్ కిల్లర్లను వేసుకుంటూ షూటింగ్కు హాజరవుతోంది.
ప్రస్తుతం ''జయం'' మోహన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ సరసన నయనతార వేలైక్కారన్ చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్లోనే నయనతార కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో అమ్మడుకు దెబ్బ తగిలినా లెక్కచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా మందుల్ని మింగి షూటింగ్లో పాల్గొంటోంది. నయనకు వృత్తి పట్ల అంకితభావాన్ని యూనిట్ సభ్యులు కొనియాడుతున్నారు.