దేశంలోని ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేస్తున్న ఓ ట్రైనీ పైలెట్ను సహోద్యోగులు కులం పేరుతో దూషించారు. ఉద్యోగం మానేసి ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో అంటూ పరుష పదజాలంతో సహ ఉద్యోగులు దూషించారు. దీంతో బాధితుడు అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎస్టీ ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు నమోదు చేశారు.
ఇండిగో ఎయిర్లైన్స్లో ట్రైనీ పైలెట్గా పనిచేస్తున్న అశోక్ కుమార్ను ఆయన సహోద్యోగులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్ కులం పేరుతో దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను చమరా, భంగీ వంటి నిమ్న పదజాలంతో దూషించారని, నువ్వు విమానం నడపడానికి అనర్హుడని, కాక్పిట్లో కూర్చోవడానికి కూడా నీకు అర్హత లేదు అని అవమానించారని అశోక్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అశోక్ కుమార్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్పై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ కిందక కూడా కేసు నమోదు చేశారు. ఈ సంఘటన విమానయాన రంగంలో కుల వివక్ష ఉందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.