జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

ఠాగూర్

సోమవారం, 23 జూన్ 2025 (18:17 IST)
పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య మృతికి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్లక్ష్యమే ముమ్మాటికీ కారమణని ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ, జగన్ చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పకుండా ఫేక్ వీడియో ఒకదాన్ని రిలీజ్ చేసి మభ్యపెట్టడం దారుణమన్నారు. 
 
జగన్ వ్యవహారశైలిపై తీవ్రంగా విమర్శలు ఆమె గుప్పించారు. మానవత్వం ఉంటే రూ.5 కోట్లు, రూ.10 కోట్లు పరిహారం ఇచ్చి క్షమించవచ్చని అడగాలి గుప్పించారు. ఇపుడు ప్రజా సమస్యలంటూ బయల్దేరడం విడ్డూరంగా ఉందాన్నారు. జగన్‌వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజలు కోసం కాదు. డబ్బుంది, బలముందని జగన్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఆయన జనసమీకరణాలకు అనుమతులు ఇవ్వొద్దని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారందర్నీ విచారణకు పిలిపించాలి. కారు కింద ఓ మనిషి పడిపోయాడని కనీస స్పృహ కారులో ఉన్న వారందర్నీ విచారణకు పిలవాలి. కారు కింద ఓ మనిషి పడిపోయాడని కనీస స్పృహ లేదు కారులో ఉన్న వాళ్లు అలాగే ముందుకు వెళ్లడం దారుణమన్నారు. 
 
తప్పు జరిగితే ఒప్పుకోకుండా ఫేక్ అంటూ సమర్థించుకుంటారా? జగన్ సైడ్ బోర్డ్ మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన పర్యటనకు అనుమతి ఇచ్చింది. దాదాపు 5 వాహనాలకే అనుమతి కానీ, ఆయన 50 వాహనాల్లో వెళ్ళి, సైడ్ బోర్డుపై నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఇది జగన్ తప్పు కాదా? జగన్‌కు మానవత్వం అనే పదానికి అర్థం తెలియదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు