జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం రిలీజైన ఈ టీజర్కు నెట్టినింట భారీ క్రేజ్ లభించింది. లైక్స్, వ్యూవ్స్ భారీగా పెరిగిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
"నాన్నకు ప్రేమతో''లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ''మిర్చి'', ''శ్రీమంతుడు'' లాంటి బ్లాక్బస్టర్స్ తీసిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో టాక్ సంపాదించుకుంది.
పైగా.. ఇందులో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండడంతో సినిమాకు ప్లస్ అయ్యింది. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అని టైటిల్కి క్యాప్షన్గా పెట్టారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్లో ఈ టీజర్ వీడియో వైరల్గా మారింది.
జనతా గ్యారేజ్ టీజర్ అంటూ హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. లేటెస్ట్ టీజర్ గమనిస్తే.. 'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ సమ్ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఓ బలవంతుడు ఉంటాడు. జనతా గ్యారేజ్ ఇచట అన్నీ రిపేర్ చేయబడును' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్లోని డైలాగే ఇది. మొత్తం 34 సెకన్ల ఈ టీజర్లో యాక్షన్ అదిరిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై జూనియర్ ఎన్టీ ఆర్ అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.