జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి మృతిపై పుకార్లు!! ఖండించిన సన్నిహితులు

ఠాగూర్

గురువారం, 24 అక్టోబరు 2024 (10:27 IST)
బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ అత్త, సినీ నటి, రాజకీయ నాయకురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీటిని జయా బచ్చన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఇందిరా భాదురి జీవించేవున్నారని, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా భోపాల్‌లో ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడించాయి. వెన్నెముక ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న ఆమె అనారోగ్యంగా ఉందని, ఈ కారణంగా ఇటీవలి రోజుల్లో వైద్యుల పర్యవేక్షణ అవసరమని వైద్య వర్గాలు వెల్లడించాయని తెలిపారు. 
 
“ఇందిరా భాదురి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఆమె అనారోగ్యంపై ఎలాంటి దుష్ప్రచారం చేయొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో జయా బచ్చన్ కుటుంబానికి అండగా ఉండాలని అభిమానులను కోరుతున్నాం అంటూ సన్నిహిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. కాగా, ఇందిరా భాదురి యొక్క 90వ పుట్టినరోజు కుటుంబాన్ని భోపాల్‌లోని వారి పూర్వీకుల ఇంటిలో ఒకచోట చేర్చి, బచ్చన్, భాదురి వంశాలకు ప్రతిష్టాత్మకమైన సందర్భాన్ని సృష్టించిందని గుర్తుచేసుకోవచ్చు. జయ కెరీర్ తొలినాళ్లలో, ఇందిర తన కూతురితో తరచూ సినిమా సెట్స్‌పై వెళుతూ, తల్లి మాత్రమే అందించగల అచంచలమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ బలమైన ఆధార స్తంభంగా నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు