జీసస్‌పై పాట పాడిన జయసుధ.. వీడియో వైరల్

మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:15 IST)
టాలీవుడ్ స్టార్ నటి, సహజ నటి జయసుధ కొత్త అవతారం ఎత్తారు. సహజ నటి జయసుధ గురించి అందరికీ తెలిసిందే. పాత సినిమాల్లో ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్‌గా కూడా నటించారు. ఆ తర్వాత ప్రస్తుత సినిమాల్లో హీరోలకు అమ్మగా, అత్తగా లీడ్ రోల్స్‌లో మెరుస్తున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు జయసుధ. 
 
వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా వున్న జయసుధ.. రాష్ట్రం రెండుగా విడిపోయిన త‌ర్వాత ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమె చేరారు. అత‌డికే త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. కొడుకుతో స‌హా వెళ్లి జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జయసుధ గాయనిగా మారారు. జయసుధ ఎప్పుడో క్రిస్టియానిటీ కూడా తీసుకున్నారు. 
 
అయితే మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. ఈ సందర్భంగా ఆమె జీసస్‌పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు