ప్రమాదం నుంచి బయటపడ్డ జూ.ఎన్.టి.ఆర్.!

మంగళవారం, 2 జనవరి 2024 (08:57 IST)
Jr.. NTR
జూ.ఎన్.టి.ఆర్. పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. ఇటీవలే  ‘దేవర’ -1  కోసం షూటింగ్ లో పాల్గొని తిరిగి ఈరోజు అంటే మంగళవారంనాడు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ న్యూస్ చెప్పారు. నిన్ననే జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. జపాన్ నుండి ఈరోజు ఇంటికి తిరిగి వచ్చాను. జపాన్ లో భూకంపాలు రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత వారం మొత్తం అక్కడే గడిపాను, అక్కడ ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా హృదయం ఉంది. ప్రజల దృఢత్వానికి కృతజ్ఞతలు మరియు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
 
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర పార్ట్ 1 ,  80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రమిది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. కాగా, నిర్మాతలు దేవర పార్ట్ 1 గ్లింప్స్ ను జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్ననే ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు