కృష్ణవంశీకి కాజల్‌ నచ్చింది... చందమామలో కాజల్ నటనకు ఫిదా!

మంగళవారం, 10 మే 2016 (19:41 IST)
దర్శకుడు కృష్ణవంశీ. తన కొత్త సినిమాకోసం చాలామంది హీరోయిన్లను ముందుగానే ఎంపిక చేసుకున్నారు. అందులో స్కూట్‌నీ చేశాక.. కాజల్‌ను ఎంచుకున్నారు.. కృష్ణవంశీ.. సందీప్‌ కిషన్‌తో.. 'నక్షత్రం' అనే సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. అప్పటినుంచి హీరోయిన్‌ను ఫైనల్‌ చేయలేదు. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.
 
చందమామ.. సినిమాలో ఆమె నటనకు కృష్ణవంశీ ఫిదా అయిపోయాడట. మగధీరతోపాటు పలు సినిమాలు చేసినా.. చందమమామతో ఆమెను పోల్చడం విశేషం. కాగా, కృష్ణవంశీకి.. రామ్‌చరణ్‌ సినిమా గట్టెక్కపోవడంతో.. పెద్ద హీరోతో చేసే ఛాన్స్‌ మిస్‌ అయింది.. దాంతో ఎదురు చూసి.. ఆఖరికి సందీప్‌కిషన్‌తో చేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి