అక్కడ గిల్లి.. ఇప్పుడేం చేస్తావ్ అనేలా ముఖం పెట్టాడు.. కంగనా రనౌత్

మంగళవారం, 22 జనవరి 2019 (18:38 IST)
ప్రపంచాన్ని మీటూ ఉద్యమం కుదిపేసిన సంగతి తెలిసిందే. మీటూ సందర్భంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నిర్మాత వికాస్ బెహల్ తన పట్ల ప్రవర్తించిన తీరును గురించి వెల్లడించింది. తాజాగా తనకు ఎదురైన అనుభవం గురించి మళ్లీ నోరు విప్పింది కంగనా రనౌత్. 
 
ఇటీవల ఓ కార్యక్రమంలో హాజరైన సందర్భంగా తన పట్ల ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడని కంగనా చెప్పుకొచ్చింది. పిరుదులపై గిల్లి.. ఇప్పుడేం చేస్తావన్నట్లు అతడు చూసిన చూపుతో తనకు చిరాకు వచ్చిందని కంగనా వెల్లడించింది. 
 
ఆడపిల్లల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఓ చర్చా వేదికలో రాణీముఖర్జీ చెప్పారు. ఆమె చెప్పింది నిజమే. మీటూ ప్రభావం చిత్ర పరిశ్రమలో బాగా ఉంది. నటీనటులతో అసభ్యంగా ప్రవర్తించే వారు ఉంటారని కంగనా చెప్పుకొచ్చింది. కాగా కంగనా ప్రధాన పాత్రధారిగా 'మణికర్ణిక' సినిమా ఈ నెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు