బాలీవుడ్ సింగర్ కనికాకు మూడోసారి కరోనా పాజిటివ్

శనివారం, 28 మార్చి 2020 (14:08 IST)
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈమెకు సోకడమే కాదు.. ఈమె మరికొంతమంది అంటించారు. దీంతో ఆమెపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసుకు నమోదు చేశారు. అంతేకాకుండా, కనికా కపూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమెకు ఇప్పటివరకు మూడుసార్లు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు పరీక్షల ఫలితాలూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. 
 
కాగా, లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్ధారించారు. 
 
కాగా ఆమెతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించారు. వారంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 63 మందికి నెగెటివ్ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అటు క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కనికాకపూర్ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు