కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖి` థియేట‌ర్ల‌లోనే

సోమవారం, 7 జూన్ 2021 (11:55 IST)
Keerthi Suresh
కీర్తి సురేష్ న‌టించిన `గుడ్ లక్ సఖి` సినిమా ఓటీటీలో విడుద‌ల కాబోతున్న‌ట్లు వస్తున్న‌వార్త‌ల‌ను చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు ఖండించారు. సోమ‌వారం వారు విడుద‌ల‌చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా దీనిని నాగేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌ప పాత్ర‌ల‌లో నటించారు. ఈ చిత్రం 20 జూన్ 2021 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
 
దిల్ రాజు నిర్మించిన “గుడ్ లక్ సఖి” తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంకా ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, రమప్రభ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు స్వరపరిచారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.ఈ సినిమాలో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో పోటీపడే షూటర్ గా నటిస్తోంది. జూన్‌ లో విదల కావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందనే వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై మేకర్స్ స్పందించారు.  సినిమాపై ఏదన్నా అప్డేట్ ఉంటే మేమే ప్రకటిస్తాం అని వెల్ల‌డించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు