'ఈడోరకం - ఆడోరకం' వంటి సూపర్హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్గా ఎం.వి.వి.సినిమా బ్యానర్పై గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా 'లక్కున్నోడు' చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. స్క్రిప్టును దర్శకుడికి అందించి, యూనిట్ సభ్యులను అభినందించారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు.
గీతాంజలి, త్రిపుర వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్కిరణ్ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంటర్టైనర్గా లక్కున్నోడు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను డైమండ్ రత్నబాబు అందిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
దేనికైనా రెఢీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.
తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, సహ నిర్మాత: రెడ్డి విజయ్కుమార్, నిర్మాతః ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్.