ఆ సీన్ ఇపుడు చేస్తే కామంతో చూస్తారేమో : నటి మందాకిని

శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:02 IST)
బాలీవుడ్ హీరోయిన్ మందాకిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళగా ఉన్న ఆమె తాజాగా చేసిన కామెంట్స్‌పై పలువురు విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్‌కపూర్ నటించిన "రామ్ తేరి గంగా మైలీ" చిత్రం ద్వారా వెండితెరకు పరిచమైన మందాకిని... తన సినీ కెరీరీ అరంభంలో క్లీవేజ్ షో చూపించే మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. అందులోనూ ఓ చంటిబిడ్డకు ఒక తల్లిగా పాలుపట్టే సన్నివేశం. అప్పడే అది సంచలనంగా మారింది. అలా ఒక మహిళ జాకెట్ తీసి బిడ్డకు పాలు ఇవ్వడం కూడా అశ్లీతగా చెప్పుకునేవారు. 
 
ఇపుడు ఈ సీన్‌పై ఆమె స్పందిస్తూ, "ఇపుడు హీరోయిన్లు చేస్తున్న స్కిన్ షోతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. అది నేను మాతృత్వంతో బాలుకు పాలు పట్టిన సన్నివేశం. దాన్ని డైరెక్టర్ ఒక జిమ్మిక్కు వాడి చిత్రీకరించారు. నేనేం అశ్లీలత చూపించలేదు. ఒకవేళ ఇపుడు కనుక ఆ సీన్ చూస్తే చాలా మంది కామంతో చూస్తారేమో" అని చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు