బాలీవుడ్ మగధీరలో పూజా హెగ్డే: షాహిద్ కపూర్ సరసన మిత్రవిందగా...?

సోమవారం, 10 అక్టోబరు 2016 (12:05 IST)
హ్యాండ్సమ్ బాలీవుడ్ షాహిద్ కపూర్ హీరోగా మగధీర రీమేక్ కానుంది. తెలుగు సూపర్ హిట్ మూవీ అయిన మగధీర.. బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో మొహంజదారో సినిమాలో నటించిన పూజా హెగ్డే.. మగధీర హిందీ రీమేక్ కోసం ఎంపికైంది.

మొహంజదారో సినిమా ఫ్లాప్ కావడంతో అమ్మడి కలలన్నీ పటాపంచలైపోయాయి. అయితే సినిమా ఫెయిల్ అవ్వడానికి పూజా మాత్రమే కారణం కాదని సినీ జనం అంటున్నారు. 
 
ఇదే విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ జనం అమ్మడికి మరో బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. తెలుగు సూపర్ హిట్ మూవీ ‘మగధీర’ అఫీషియల్ రీమేక్‌లో పూజా హీరోయిన్‌గా కన్ఫామ్ అయిందని తెలుస్తోంది. దీంతో అమ్మడు మరోసారి గాల్లో తేలిపోతోందట. హిందీ ‘మగధీర’లో ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా ఫైనలైజ్ అయ్యాడు. ఇక ‘మొహెంజొదారో’లో పాత్రకు తగ్గట్టు పూజా హెగ్డే ఒదిగిపోయిన సంగతి తెలిసిందే.
 
మొహంజదారోలో దైవాంశ సంభూతురాలిగా కనిపించిన పూజ…. ఆ పాత్రకు సరిగ్గా సూట్ అవ్వడంతో… ‘మగధీర’లో మిత్రవింద పాత్రకూ ఆమె సరిపోతుందని ఫిక్స్ అయిపోయారట. ప్రస్తుతం డీజేలో అల్లు అర్జున్‌తో పూజా హెగ్డే కలిసి నటించనున్న సంగతి విదితమే. 

వెబ్దునియా పై చదవండి