NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

దేవీ

బుధవారం, 7 మే 2025 (10:19 IST)
Neel- ntr
ఎన్.టి.ఆర్., దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే షెడ్యూల్ జరిగింది. ఎన్.టి.ఆర్. నటనను చూసి మోనిటర్ లో వీక్షిస్తున్న దర్శకుడు మాడ్ సెట్ విత్ మ్యాడ్ మేన్ అంటూ ఎన్.టి.ఆర్.కు కితాబిచ్చారు. ఇప్పటివరకు చేసిన రష్ చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా పీరియాడిక్ యాక్సన్ డ్రామాగా రూపొందుతోంది.
 
ఇక ఎన్.టి.ఆర్. పుట్టినరోజైన మే 20న అదిరే అప్ డేట్ ఇస్తామని దర్శకుడు తెలియజేస్తున్నాడు. కె.జి.ఎఫ్., సలార్ సినిమాల తర్వాత నీల్ చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఎన్.టి.ఆర్. బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేశాడు. అది కూడా విడుదలకు సిద్ధమైంది. దేవర తర్వాత ఎన్.టి.ఆర్. కాస్త ఒల్లు తగ్గారు. ఇటీవలే ఆయన ఎయిర్ పోర్ట్ లో కనిపించగా చాలా బరువు తగ్గినట్లు కనిపించారు. ఇక వార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల బిజినెస్ చేస్తుందనే టాక్ నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు