అందుకు ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం అని చెప్పిన‌ పూరీ

శుక్రవారం, 26 జులై 2019 (17:49 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజైన ఫ‌స్ట్ డే ఫ‌ష్ట్ షో నుంచి బ్లాక్‌బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో స‌క్స‌ెస్ టూర్ నిర్వ‌హిస్తుంది.
 
ఈ టూర్లో పూరి జ‌గ‌న్నాథ్ మీడియాతో మాట్లాడుతూ... ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. స‌క్సెస్ కంటే ఎక్కువ మ్యాడ్నెస్ క్రేజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 3 ఇయ‌ర్స్ త‌ర్వాత నాకు ఇంత పెద్ద హిట్ రావ‌డం సో..హ్యాపీ. థియేట‌ర్‌కి వెళ్లి చూసాను. ప్రేక్ష‌కులు సాంగ్స్ కానీ.. డైలాగ్స్ కానీ.. ఎంజాయ్ చేయ‌డం చూస్తుంటే... మాకు ఎన‌ర్జీని ఇస్తుంది. 
 
మాస్ సినిమా పొట‌ెన్షియ‌ల్ ఏంటో ఈ సినిమా చెప్పింది నాకు. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాన‌ని అనుకుంటున్నాను. సిద్దిపేట‌, అనంతపురం, క‌ర్నూలు వెళ్లాం. విజ‌య‌వాడ వ‌చ్చాం. ఏలూరు, భీమ‌వ‌రం.. ఇలా వైజాగ్ వ‌ర‌కు ఈ విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగిస్తాం.

మా హీరో ఇస్మార్ట్ శంక‌ర్ యు.ఎస్ ట్రిప్‌లో ఉండ‌టం వ‌ల‌న ఈ టూర్లో లేడు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతాది. విజ‌య‌వాడ మ‌ళ్లీ వ‌స్తాం మరోసారి ప్రేక్ష‌కుల్ని క‌లుస్తాం. సినిమా బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు అన‌డానికి ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు