మారేడుపల్లి అడవుల్లో పుష్ప చిత్ర యూనిట్: వందల మంది ఫైటర్లతో..?

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:33 IST)
సూపర్ హిట్ అందుకున్న ఆర్య, ఆర్య 2 మూవీల తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో మూవీతో వస్తున్నాడు. అదే.. పుష్ప మూవీ.. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కూడా. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. భారీ అంచనాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించనున్నారు.
 
అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ఈ మూవీలో కీ రోల్స్ పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2021 డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజున పుష్ప మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి అయ్యింది.
 
కాగా.. ఫైనల్ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఈ అడవులలో చిత్ర బృందం కొన్ని కీలక సీన్లను చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, వందల మంది ఫైటర్లతో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నారు. 
 
మారేడుపల్లి అడవుల్లో పుష్ప చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. సెప్టెంబర్ ఆఖరి వరకు షూటింగ్ అక్కడే జరుగనుంది. అక్టోబర్ నెలలో ఈ మూవీ షెడ్యూల్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించనున్నారు దర్శకనిర్మాతలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు