దేశం ఇమేజ్ సంగతి దేవుడెరుగు, ముందు ప్రజల ప్రాణాలను కాపాడండి: అనుపమ్ ఖేర్

గురువారం, 13 మే 2021 (12:27 IST)
ముంబై: దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం ప‌లు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్ర‌ధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించే న‌టుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు త‌న గొంతు మార్చారు.

కోవిడ్ సెకెండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని, దేశంలో జ‌రుగుతున్న అల్ల‌క‌ల్లోలానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. దేశానికి ఇమేజ్ సృష్టించడం కంటే ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని, దీనిని ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ప్రతిరోజూ కరోనా కార‌ణంగా నాలుగు వేల మంది వ‌ర‌కూ మరణిస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు వస్తున్నాయన్నారు. ఆరోగ్య సంక్షోభాన్ని చ‌క్క‌దిద్ద‌డంలో కొంత లోపం జరిగిందని విమ‌ర్శించారు. అయితే దీనిని ఇత‌ర‌ పార్టీలు తమ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించడం సరికాద‌న్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు