టెన్ష‌న్‌లో రాజ్ త‌రుణ్‌.. స‌క్స‌స్ కోసం ఏం చేస్తున్నాడో తెలుసా..?

బుధవారం, 13 జూన్ 2018 (20:53 IST)
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్... ఇలా తొలి మూడు చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. ఈడోర‌కం ఆడోర‌కం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అంధ‌గాడు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన రాజ్ త‌రుణ్ తాజాగా రాజుగాడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే.. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డింది. 
 
దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ రాజ్ త‌రుణ్ ఈసారి స‌క్స‌స్ కోసం సెంటిమెంట్‌ని న‌మ్ముకున్నాడ‌ని తెలిసింది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏమిటంటే.. రాజ్ త‌రుణ్, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టించిన కుమారి 21 ఎఫ్ స‌క్స‌స్ సాధించింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన ఈడో ర‌కం ఆడో ర‌కం, అంధ‌గాడు చిత్రాలు కూడా మంచి విజ‌యాల్ని సాధించాయి. దీంతో స‌క్స‌స్ కోసం రాజ్ త‌రుణ్ నాలుగోసారి హెబ్బా ప‌టేల్‌తో జ‌త క‌ట్ట‌నున్నాడ‌ని తెలిసింది. 
 
తమిళంలో వచ్చిన 'నానుమ్ రౌడీ దాన్' మూవీకి ఇది రీమేక్. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార జంటగా న‌టించారు. విఘ్నేశ్ శివన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ్‌లో విజ‌యం సాధించిన‌ ఈ సినిమాను నిర్మాత సి.కళ్యాణ్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. మ‌రి.. రాజ్ త‌రుణ్‌కి సెంటిమెంట్ వ‌ర్కువుట్ అవుతుందా..? ఈసారైనా విజ‌యం వ‌రిస్తుందా.. లేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు