తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ కుమార్తెల్లో ఒకరు సౌందర్య. ఈమె దర్శకురాలు కూడా. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం ఆరేళ్ళ క్రితం జరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా వీరిరువురి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం.
ఈనేపథ్యంలో విడాకులు కోరుతూ ఆమె చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. ఆమె విడాకులు కోరడానికి మరో కారణం లేకపోలేదు. అశ్విన్ కుమార్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ, ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లివున్నారు. ఈ కారణంగానే ఆమె విడాకులు కోరినట్టు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.