హోటల్‌కు వెళ్తే అలా చేశాడు.. బ్రేకప్ చేశాను.. జాకీ వచ్చాక అంతా మారిపోయింది.. రకుల్

సెల్వి

శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (13:56 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి జీవితం గురించి నోరు విప్పింది. తన భర్త జాకీతో తన వివాహ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా హ్యాపీగా వుందని చెప్పుకొచ్చింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఆనందంగా వున్నామని రకుల్ వెల్లడించింది. 
 
తాను షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి తను కూడా ఇంట్లో వుంటాడని, ఇద్దరం సరదాగా సమయం గడుపుతామని.. కెరీర్ విషయాలను, వైవాహిక బంధానికి ఎలాంటి అడ్డు లేకుండా ప్లాన్ చేసుకుంటామని తెలిపింది. 
 
జాకీని కలిశాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని, జాకీ తన జీవితంలోకి వచ్చాక సంబంధాల విలువ తెలిసిందని.. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో వున్నప్పుడు చిన్న కారణంగా అతడిని రిజెక్ట్ చేశానని రకుల్ వెల్లడించింది. 
 
ఓసారి రిజక్ట్ చేసిన వ్యక్తితో హోటల్‌కు వెళ్తే.. అతడు తన కోసం వేయించిన వంటకాన్ని ఆర్డర్ చేశాడు. అది తనకు నచ్చలేదని.. అందుకే బ్రేకప్ చేశానని రకుల్ తెలిపింది. తనకంటూ కొన్ని సొంత ఆహారపు అలవాట్లున్నాయని.. అతడు తాను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో అతనికి బ్రేకప్ చెప్పానని.. ఆహారం, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానని.. భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తితో తనకెందుకు అని అతనికి గుడ్ బై చెప్పేసానని రకుల్ తెలిపింది. 
 
ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని.. జాకీ వచ్చాక తన జీవితం మరింత హ్యాపీగా మారిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో మూడేళ్ల ప్రేమాయణం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న రకుల్ అతనిని వివాహం చేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు