తమిళ హీరో జయం రవి నటించిన ''థని ఒరువన్'' సినిమాపై చెర్రీ మనసుపడ్డాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన థని ఒరువన్ సినిమాలో జయం రవి హీరోగా, హీరోయిన్గా నయనతార నటించింది. ఓ పోలీసు స్టోరీతో వచ్చిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. జయం రవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ చిత్రాన్ని చూసిన మన చెర్రీ ఫిదా అయిపోయాడట.
ఇటీవలి కాలంలో చరణ్ కూడా పోలీసు పాత్రల్ని చేస్తున్నాడు. `తుఫాన్`లో పోలిసుగా కనిపించిన ఆయన కొత్త సినిమా `బ్రూస్ లీ`లోనూ ఖాకీ వేశాడు. అందుకే మళ్లీ ఖాకీ కథపై మనసుపడ్డాడట. "థని ఒరువన్" రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండని తనతో సినిమాలు చేయాలనుకొంటున్న దర్శకులకు చరణ్ చెప్పాడని సమాచారం. వాళ్లు ఇప్పుడు ఆ సినిమాని చూసి అభిప్రాయం చెప్పే పనిలో పడ్డాడట. అన్నీ కుదిరితే చెర్రీ ఆ జయం రవి సినిమా రీమేక్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట.