తీపిగుర్తుల్లో ఇదొక‌టి అంటున్న రామ్‌చ‌ర‌ణ్‌

మంగళవారం, 30 మార్చి 2021 (19:40 IST)
Ramcharan still
రామ్‌చ‌ర‌ణ్ పుట్ట‌నరోజు ఈనెల 27వ‌తేదీ. మూడు రోజుల‌త‌ర్వాత త‌న‌కు జీవితంలో కొన్ని తీపి గుర్తులు వున్నాయి. అందులో ఒక‌టి రంగ‌స్థ‌లం సినిమా అని ట్వీట్ చేశాడు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. రంగ‌స్థ‌లం సినిమా మార్చి 30, 2018న విడుద‌ల‌కావ‌డ‌మే. స‌రిగ్గా ఈరోజుకు మూడేళ్లు గ‌డిచాయి. అందుకే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ, రంగ‌స్థ‌లంలో డి.ఎస్‌.పి.తో కూడిన సంగీత బాణీని పొందుప‌ర్చారు. ఇది నాకు మెమొర‌బుల్ అంటూ తెలియ‌జేస్తున్నాడు.

చెవిడివాడిగా భిన్న‌మైన పాత్ర‌ను పోషించి మెప్పించిన రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. 1980ల‌ నేపథ్యంలో రూపొందింది. సుకుమార్ దర్శకత్వం వ‌హించారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు