అకున్ సబర్వాల్ అను అమరేంద్ర బాహుబలితో దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 తీస్తారేమోనంటూ వర్మ సెటైర్లు. సుబ్బరాజును, పూరీ జగన్నాథ్లను 11 గంటలపాటు విచారించినట్లు పట్టుబడిన స్కూలు పిల్లలను, ఇతర వ్యక్తులను ఇలాగే విచారణ చేయగలరా అంటూ సవాల్ విసిరారు వర్మ.
వర్మ చేసిన కామెంట్లపై ఎక్సైజ్ శాఖ అధికారి చంద్రవదన్ స్పందించారు. కొందరు వ్యక్తులు ఎక్సైజ్ డిపార్టుమెంటును ట్వీట్లు, ఫేస్ బుక్ ద్వారా కించపరచడం శోచనీయమని చంద్రవదన్. సినీ రంగాన్నే టార్గెట్ చేశామనడం సరికాదు. డ్రగ్స్ కేసులో మేం లోతుగా విచారణ చేస్తున్నాం. ఎక్సైజ్ చేస్తున్న విచారణను హాస్యాస్పదం చేయడం సరికాదు.