వాళ్లు కోరినట్టుగానే చూపించేందుకు సిద్ధం.. అపుడే ఫ్యాన్స్ పెరుగుతారు: రాశి ఖన్నా

గురువారం, 28 జులై 2016 (16:22 IST)
అభిమానులు కోరినట్టుగా తన అందచందాలను ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ నటి రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. అపుడే అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతారని వ్యాఖ్యానించింది.
 
ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు మణిరత్నం ‘గీతాంజలి’ వంటి సినిమాలో నటించాలని ఉందని, అలాంటి సినిమాలైతేనే తనకు బాగా సూటవుతాయని, సంతృప్తికరంగా కూడా ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలో పర్యటించినపుడు జనం పూర్తి మాస్ ఫిలింలో ఎప్పుడు కనిపిస్తావని అడిగారని చెప్పింది. తనను వాళ్ళు ఎలా చూడాలనుకుంటే అలాగే నటిస్తానని తెలిపింది.
 
ఇంతకాలం తన కేరక్టర్ బలంగా ఉన్న స్క్రిప్ట్‌ల కోసం వెతికినట్టు చెప్పింది. మంచి నటుడితో తెలుగులో కమర్షియల్ ఫిలిం చేస్తే తనను అభిమానించేవారు పెరుగుతారని ఇప్పుడే తెలిసిందని చెప్తోంది. తాను రామ్‌తో కలిసి నటించిన చిత్రం ‘హైపర్’ త్వరలో విడుదల కాబోతోందని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి