తమిళ ఇంటి కోడలు కావాలంటున్న 'భీష్మ' భామ

గురువారం, 13 మే 2021 (12:51 IST)
'ఛలో' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా. 'గీతగోవిందం' చిత్రంతో ఈమె క్రేజ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో నటిస్తోంది. 
 
అయితే, ఇటీవలే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హీరో కార్తీ నటించిన 'సుల్తాన్‌' సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించి, ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా విభిన్నంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా ఇక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. తమిళ వంటకాలంటే అమితమైన ఇష్టం. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక అని చెప్పుకొచ్చింది. సో... రష్మిక కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు