పదవ తరగతి చదువుతున్న బాలిక జూలై 23న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కన్నతండ్రి కిరాతకుడని తేలింది. ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం కావడంతో బాలిక, నవజాత శిశువును కన్హాంగడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి అధికారులు వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో గల్ఫ్లో ఉన్న నిందితుడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు. విచారణలో, అతను తన కుమార్తెను లైంగికంగా వేధించినట్లు అంగీకరించాడు. ఇంతలో, తండ్రి, బాలిక ఇద్దరి DNA నమూనాలను పరీక్ష కోసం పంపారు. మద్యం మత్తులో తన కుమార్తెను లైంగికంగా వేధించానని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
తన తండ్రి వేధింపులను వెల్లడిస్తూ బాలిక పోలీసులకు చెప్పగా, తల్లి గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని పేర్కొంది. వైద్య సంరక్షణ తర్వాత బాలికను డిశ్చార్జ్ చేశారు. నవజాత శిశువు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది.