"కేజీఎఫ్-3" కోసం ఎదురు చూస్తున్నాను.. రవీనా టాండన్

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (09:19 IST)
బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ ఒకప్పుడు గ్లామర్ గర్ల్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌ సినిమాల్లో కనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అదరగొట్టింది. ఇంకా అవార్డులు గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఇటీవలే రవీనా టాండన్‌కి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, 48 ఏళ్ల నటి తాను "కేజీఎఫ్-3" కోసం ఎదురు చూస్తున్నానని రవీనా టాండన్ పేర్కొంది. "కేజీఎఫ్-2"లో ఆమె దివంగత ఇందిరా గాంధీ మోడల్‌గా భారత ప్రధానిగా నటించింది. 
 
సినిమాలోని ప్రతి నిమిషం తనకు నచ్చిందని, పార్ట్-3 కోసం సెట్‌కి తిరిగి రావడానికి వేచి ఉండలేనని చెప్పింది. కేజీఎఫ్ పార్ట్ 3ని దర్శకుడు ప్రశాంత్ నీల్‍‌తో పాటు నిర్మాతలు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు