పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ

సోమవారం, 31 జనవరి 2022 (12:58 IST)
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఇపుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. 
 
పవన్ కళ్యాణ్ గారూ ఆ రోజు 'సర్దార్ గబ్బర్ సింగ్‌'ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు. ఫలితం చూసారు. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా.. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి.. పవర్ ప్రూవ్ చెయ్యండి.
 
అయిన మీరు నటించిన "భీమ్లా నాయక్" ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్‌కి ఆన్సర్ చెయ్యలేము. 
 
రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగుని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి 'భీమ్లా నాయక్'ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
 
అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైమ్‌లో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్‌నెస్‌ని అర్థం చేసుకోండి అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు