పంచభూతరహిత గాత్రమిదే అంటున్న బెల్లంకొండ.. "సాక్ష్యం" మోషన్ పోస్టర్ (Video)

గురువారం, 19 అక్టోబరు 2017 (09:31 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఇటీవల "జయ జానకి నాయక" చిత్రం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం "సాక్ష్యం". శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 
 
మోషన్ పోస్టర్‌లో 'పంచభూతరహిత గాత్రమిదే.. పంచభూత కృత క్షేత్రమిదే' అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా ఉంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్‌కుమార్, జగపతిబాబు, మీన, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు