రాజస్థాన్‌లో వెంకీ కుమార్తె వివాహం.. హాజరైన సల్మాన్ ఖాన్

శనివారం, 23 మార్చి 2019 (14:18 IST)
రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం అట్టహాసంగా జరుగనుంది. ఆదివారం జరిగే ఈ వేడుక కోసం సెలెబ్రెటీలు భారీ స్థాయిలో హాజరుకానున్నారు. ఈ వివాహ వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటు కుటుంబీకులతో పాటు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు.  
 
వెంకటేష్ కుమార్తె అశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో పెళ్లితో ఒక్కటవుతున్నారు. ఈ పెళ్లి వేడుక కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రానా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత తదితరులు కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొని సందడి చేశారు.
 
ఇకపోతే.. ఈ నెల 28న వివాహ రిసెప్షన్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. వరుడు వినాయక రెడ్డి హైదరాబాద్‌లోని రేస్‌ క్లబ్‌ అధిపతి సురేందర్‌ రెడ్డి మనవడు. ఈ వివాహం నేపథ్యంలో వెంకటేశ్‌ 'వెంకీ మామ' చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు