పెళ్లయ్యాక నాలో చాదస్తం మరింత ఎక్కువైంది.. 'యూ టర్న్‌' సమంత

బుధవారం, 13 డిశెంబరు 2017 (12:35 IST)
అక్కినేని నాగచైతన్యను అక్టోబర్‌లో పెళ్లాడిన అందాల రాశి సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. పెళ్లాడిన తర్వాత చాదస్తం బాగా పెరిగిపోయిందని వెల్లడించింది.
 
పెళ్లాడాక కొత్తగా తనలో ఎలాంటి మార్పులు రాకపోయినా.. మొదటి నుంచి తనలో వున్న చాదస్తం మరింతగా  పెరిగిందని చెప్పుకొచ్చింది. ఏదైనా కథ వింటే తప్పులు వెదికే వైఖరి పెరిగిపోయిందని అంది. పెళ్లి కాకముందు కాస్త నచ్చని కథలు తన ముందుకు వచ్చినప్పుడు, వాటి గురించి మరింత లోతుగా విశ్లేషణ చేస్తున్నానని సమంత తెలిపింది. మంచి సినిమాలు చేతిలో ఉండటం వల్లే నచ్చని కథలను అలా వదిలేస్తున్నానని తెలిపింది. 
 
ఇదిలావుంటే సమంత నిర్మాతగా మారనున్నారు. గతంలో అనుకున్నట్టుగానే కన్నడలో సూపర్ హిట్ అయిన చిత్రం 'యు టర్న్'తోనే నిర్మాతగా మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి నిర్మాణం విషయంలో మామయ్య నాగ్ సలహాలు కూడా ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కన్నడలో లూసియా చిత్రం ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ నటించలేదు. అయినా మౌత్ టాక్‌తో మంచి వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నిర్మాతగా బాధ్యతలు చేపడుతూనే.. నటించనుందని టాక్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు