త్వరలోనే కలుద్దాం అంటూ ఆస్పత్రి నుంచి సాయిధరమ్ ట్వీట్

ఆదివారం, 3 అక్టోబరు 2021 (18:58 IST)
గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్... ఆస్పత్రి నుంచి ఆదివారం ఓ ట్వీట్ చేశారు. 'నాపై మరియు నా చిత్రం 'రిపబ్లిక్' పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం'అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే సంకేతం పంపించారు.
 
సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా నుంచి చాలా రోజుల తర్వాత సడన్‌గా వచ్చిన పోస్టుతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో సాయితేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగానే అర్థమైపోతుంది. మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నట్లుగా సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఆదివారం ఉదయం మీడియాతో వెల్లడించిన విషయం తెల్సిందే.
 
కాగా, సాయి ధరమ్ తేజ్ నటించిన రాజకీయ డ్రామా ‘రిపబ్లిక్’ ఈ నెల ఒకటో తేదీన విడుదలై విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘కొండపొలం’ విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
See you soon pic.twitter.com/0PvIyovZn3

— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు