కామాటిపుర వేశ్యగా నటించనున్న 'గూఢచారి' హీరోయిన్

సోమవారం, 27 ఆగస్టు 2018 (16:16 IST)
అడవి శేష్ హీరోగా వచ్చిన చిత్రం "గూఢచారి". మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ్ళ అనే తెలుగమ్మాయి హీరోయిన్‌గా నటించింది. ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ అమ్మడికి వ‌ర‌ుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈమె తన తాజా చిత్రంలో సెక్స్ వర్కర్‌గా నటించనుంది.
 
గతంలో తనకు బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ అమ్మడు చెప్పకనే చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మాజీ మిస్ ఇండియా ఓ ఛాలెంజింగ్ రోల్‌లో నటించనున్నట్టు సమాచారం. మలయాళంలో తెరకెక్కుతున్న 'ముతోన్' అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ వేశ్య పాత్రలో కనిపించనుందట. 
 
ఇందుకోసం ఆమె పలు ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార ఏరియాల్లో పర్యటిస్తూ, పలువురు వ్యభిచారిణిలతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందట. కానీ కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రను స్వీకరించి శోభిత పెద్ద సాహసం చేస్తుందనే చెప్పాలి. మరి ఈ అమ్మడికి సినీ ప్రేక్షకులు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో వేచిచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు