కొంతమంది దర్శకులు బాగా వాడేసుకున్నారు : పాయల్ రాజ్‌పుత్

ఆదివారం, 2 జులై 2023 (08:58 IST)
'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పంజాబీ అందాల బొమ్మ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఒక్కటి కూడా ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. వెంకటేశ్, రవితేజ వంటి హీరోల సరసన నటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తన ఐదేళ్ల సినీ కెరియర్‌పై ఆమె తాజాగా స్పందించారు. 
 
''ఆర్ఎక్స్ 100' చిత్రం సక్సెస్ తర్వాత నేను ఒక్కదాన్నే హైదారాబాద్ నగరంలో ఉన్నాను. దీంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను మిస్ గైడ్ చేశారు. కొంతమంది దర్శకుకులు కూడా తప్పుదోవ వట్టించి నన్ను బాగా వాడుకున్నారు" అని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
'ఇపుడు బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలో బాగా ఆలోచించిన తర్వాతే సంతకం చేస్తున్నాను. వెంకటేశ్ చాలా మంచి మనిషి. ఆయనతో కలిసి సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో మళ్లీ ఛాన్స్ వచ్చినా నేను నటించేందుకు సిద్ధంగా ఉన్నాను' అని చెప్పారు. 
 
'సాధారణంగా చిత్రపరిశ్రమలో ఒకసారి అగ్రస్థానానికి చేరుకుంటాం. అలాగే కిందికీ పడిపోతాం. కానీ వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలి. నెగటివిటీని వదిలేసి, పాజిటివ్‌గా ముందుకు వెళుతున్నా అని చెప్పుకొచ్చింది. తనకు తొలి సినిమాలో అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే చిత్రంలో నటిస్తున్న'ట్టు పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు