శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

దేవి

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (17:56 IST)
Sri Vishnu
శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు బాబీ, కోన వెంకట్ నిర్మాతలుగా చిత్రం ప్రారంభం అయింది. రాజమండ్రీలో షూటింగ్ కొనసాగుతుంది. సంయుక్త మీనన్ కథా నాయికగా నటిస్తోంది. జానకి రాం దర్శకత్యం వహిస్తున్నారు. హీరో, హీరొయిన్ లపై లవ్ ట్రాక్ చేత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉండగా, నేడు మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు.
 
అనౌన్స్ మెంట్ పోస్టర్  హీరో హోండా CD100 బైక్ ఐదు టైర్లతో ప్రజెంట్ చేయడం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. 'క్రేజీ రైడ్ కోసం రండి - బ్రేక్‌లు లేవు, నవ్వులు మాత్రమే!” అనే కోట్ సినిమా ఎసెన్స్ ని హెల్తీ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ప్రజెంట్ చేస్తోంది.
 
ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగుతుందని హోర్డింగ్‌లు రివిల్ చేస్తున్నాయి. ఈ క్రేజీ   ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు, తన సిగ్నేచర్ చార్మ్ ని తెరపైకి తీసుకువస్తారు.
 
ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. స్టార్ టెక్నిషియన్స్ ఈ సినిమాని పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం సమకూరుస్తారు. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు