14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సరుకుల పంపిణీ

గురువారం, 28 మే 2020 (21:45 IST)
సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్,  తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు.
 
వారిలో 12 వేల మంది సినీ, 2 వేల మంది టీవీ కార్శికులకు మొత్తం 14వేల మందికి నిత్యావసరాల పంపిణీ అన్నపూర్ణ 7ఎకర్స్‌లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయి, ఎన్.శంకర్, సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
 
సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయి, ఎన్.శంకర్, సి.కళ్యాణ్ చేతుల‌ మీదుగా కార్మిక యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు