ఇప్పుడు మాతృ సినిమాను నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు గుండెల్ని కదిలిస్తున్నాయి. మనసు తాకే పాటల్ని విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నారు. తల్లి కోసం పడే వేదనను చూపించేలా ఈ చూస్తున్నవేమో అన్న పాటను కంపోజ్ చేశారు. శేఖర్ చంద్ర బాణి, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కారుణ్య గానం ఈ పాటను పదే పదే వినాలనిపించేలా చేస్తోంది. జాతీయ అవార్డు సాధించిన సుద్దాల అశోక్ తేజ రచించిన లిరిక్స్ గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయి. ఇక కారుణ్య గాత్రంలోని ఆ ఆర్ద్రత శ్రోతల గుండెల్ని తాకేలా ఉంది.
ఇక ఇలాంటి గొప్ప పాటను తాజాగా దర్శక, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ మెచ్చుకున్నారు. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ పాటను ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం మదర్ సెంటిమెంట్ మీద సినిమాలు అంతగా రావడం లేదని, తల్లి ప్రేమను చాటే పాటలు కూడా రావడం లేదని ఆయన అన్నారు. మాతృ టీంను అభినందిస్తూనే ఆల్ ది బెస్ట్ తెలిపారు.
తారాగణం : శ్రీరామ్, నందిని రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్, అలీ, ఆమని, కాలే రవి, దేవి ప్రసాద్, పృధ్వి తదితరులు