టీజర్ పోస్టర్ తేజ సజ్జా చేతిలో మంత్రదండం పట్టుకుని నడుస్తున్న రైలు పైన నిలబడి, రిస్కీ స్టంట్ చేస్తూ క్యారెక్టర్ బోల్డ్ నేచర్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమాలో మనోజ్ మంచు విలన్ నటించగా, రితికా నాయక్ కథానాయికగా నటించింది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ యాక్షన్-అడ్వెంచర్ ముంబైలోని చారిత్రాత్మక గుహలలో కొత్త షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. తేజ సజ్జాతో పాటు, కొంతమంది ప్రధాన తారాగణం ఈ తాజా షెడ్యూల్లో పాల్గొంటున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్ప్లేను కూడా అందించగా, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి సంగీతం అందించగా, శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.