'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7 శుక్రవారం రీరిలీజ్ చేస్తున్నాం. అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి' అన్నారు నిర్మాత దిల్ రాజు.