సినీ నటి చార్మీ ఇంట విషాదం.. అత్తా నువ్వు స్వర్గంలో వైన్ తాగుతూ హ్యాపీగా...

శుక్రవారం, 17 జులై 2020 (21:00 IST)
సినీ నటి చార్మీ ఇంట ఓ విషాదం నెలకొన్నది. ఆమె బంధువులలో ఒకరైన ఆమె అత్తగారు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని చార్మీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె భావోద్వేగమైన పోస్టును పెట్టారు. మీరు లేరనే వార్తను తట్టుకోలేక పోతున్నానని ఎమోషల్ పోస్టు పెట్టారు.
 
నిన్ననే మనం మాట్లాడుకున్నాం అయితే ఇదే చివరిసారి అవుతుందని అనుకోలేదని, మీరు లేరు అన్న మాటను జీర్ణించుకోలేకపోతున్నానని, మీరు లేరని తెలిసాక మాటలు రావడం లేదని తెలిపారు. స్వర్గంలో మీరు సంతోషంగా వైన్ తాగుతూ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని ఆశిస్తున్నాను.
 
నాకెంతో ప్రియమైన ఆంటీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చార్మీ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇక చార్మీ చాలా సినిమాలో నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చార్మీ నిర్మాతగా మారారు. ఆమె “జ్యోతిలక్ష్మీ” అనే సినిమాలో నటించింది చివరిది. ఈ సినిమా నిర్మాత కూడా చార్మినే. తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరితో కలిసి నిర్మించింది. ఈ సినిమా అటు పూరికి ఇటు చార్మీకి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న పైటర్ అనే సినిమాకు కూడా చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు