త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

దేవి

శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:06 IST)
Trigun, Megha Chaudhary
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న  కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది.  తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మార్చి 7న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
 
ప్రముఖ హాస్యనటులంతా ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న 'జిగేల్' మాస్ క్లాస్ ఆడియన్స్ అంతా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేస్తారని, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని నిర్మాతలు Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం తెలిపారు.  
 
ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి పని చేయడం జరిగింది. ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.  
 
నటీనటులు: త్రిగుణ్ , మేఘా చౌదరి, షియజి షిండే, పోసాని కృష్ణమురళి,  రఘు బాబు, పృథ్వీ రాజ్,  మధు నందన్,  ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని,  జయ వాణి,  అశోక్, గడ్డం నవీన్,  చందన, రమేష్ నీల్, అబ్బా  టీవీ డా. హరిప్రసాద్ 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు