హీరోయిన్ త్రిష - దర్శకుడు ప్రియదర్శన్‌లకు కరోనా పాజిటివ్

శుక్రవారం, 7 జనవరి 2022 (22:29 IST)
దక్షిణాది చిత్రసీమకు చెందిన సినీ నటులు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత దర్శకుడు థమన్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం హీరోయిన్ త్రిష, దర్శకుడు ప్రియదర్శన్‌లకు కూడా కరోనా వైరస్ సోకింది. 
 
ఇదే విషయంపై నటి త్రిష తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే కరోనా వైరస్ సోకింది. తనలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నాను. నిన్నటితో పోల్చితే శుక్రవారం ఆరోగ్యం ఎంతో హుషారుగా ఉంది. ప్రతి ఒక్కరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి. ముఖానికి మాస్క్ ధరించండి. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే, 64 యేళ్ల దర్శకుడు ప్రియదర్శన్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, ఈయన ఇటీవల "మరక్కార్ - అరేబియా సముద్ర సింహం" అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు